ఈనెల 15న పాఠశాలకెళ్లి అదృశ్యమైన బాలిక ఇందు అనుమానాస్పదస్థితిలో చెరువులో మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. ఇందు మరణం ప్రమాదవ శాత్తు జరిగిందని.. హత్య కాదని పోలీసులు తేల్చారు. బాలిక ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయినట్లు వెల్లడించారు. మూత్ర విసర్జన కోసం చిన్నారి.. చెరువు దగ్గరకి వెళ్లిందని చెప్పారు. ఆడుకునేందుకు వచ్చిన చిన్నారికి.. ఎక్కడా సరైన ప్రదేశం లేకపోవడంతో మూత్ర విసర్జన కోసం చెరువు వద్దకి వెళ్లిందని వివరించారు. ఆ సమయంలో కాలు జారి పడిపోయినట్లు తెలిపారు. ఇందు ఊపిరితిత్తుల్లోకి చెరువు నీరు వెళ్లిందన్న పోలీసులు.. పోస్ట్మార్టం రిపోర్ట్లో వైద్యులు ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు.
ఇందు మృతి మిస్టరీ వీడింది !
December 19, 2022
0