ఛత్తీస్గఢ్ లోని రాజ్నంద్గావ్కు చెందిన చంద్రభూషణ్ అనే వ్యక్తి కనిపించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోట్నా పానీ అడవుల్లో రెండు రోజుల క్రితం సగం కాలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసుల ఘటనా స్థలానికి వెళ్లి ఆ సగం కాలిన మృతదేహాన్ని చంద్రభూషణ్గా వారి కుటుంబ సభ్యుల సహకారంతో గుర్తించారు. ఆ తర్వాత చంద్రభూషణ్ ప్రియురాలు రాగిణి సాహును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెల్లడించింది. తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వక పోవడంతో తమ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని, పలుమార్లు తనను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధించడంతో నూతన సాహు అనే స్నేహితుడితో కలిసి హత్య చేసినట్టు వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రాగిణి సాహును అరెస్టు చేశారు.
తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వనందుకు ప్రియుడి హత్య !
December 20, 2022
0
Tags