ప్రియురాలిని కౄరంగా హత్య చేసిన ప్రియుడు

Telugu Lo Computer
0


ఒడిశాకు చెందిన జగన్నాథ్ గోడ, కునిదర్ సీమాదాస్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో కునిదర్ సీమాదాస్ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని జగన్నాథ్ గోడ కునిదర్ సీమాదాస్ ను గుజరాత్ ‭లోని సూరత్ ‭కు రప్పించి అక్కడ హతమార్చాడు. సూరత్ నగరాన్ని తిరిగి చూద్దామంటూ మాయ మాటలు చెప్పి మోసపూరితంగా కునిదాస్‌ను నేరస్థలానికి తీసుకెళ్లాడు. అనుకున్న స్థలానికి చేరుకున్నాక బాధితురాలిని చనిపోయే వరకు 49 సార్లు కత్తితో పొడిచాడు. అనంతరం ఎడారిలో ఆమె మృతదేహాన్ని పడేసి, భువనేశ్వర్‌కు తిరిగి వచ్చాడు. మృతదేహాంపై సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ధరించిన టీ-షర్టు నుంచి వారికి ప్రధాన ఆధారం లభించింది. పోలీసులు సీసీ కెమెరాల సాయంతో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లలో ఆరా తీశారు. చివరికి సూరత్ పోలీసులు నిందితుడిని గుర్తించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్యానేరం) కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని భువనేశ్వర్ వెళ్లి అరెస్టు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)