మంచు తుపానులో చిక్కుకుని మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ కి  చెందిన ప్రముఖ రచయిత, చిత్రకారుడు, బొమ్మల శిల్పి బాలి కుమారుడు మేడిశెట్టి గోకుల్‌ (45) అమెరికాలో మంచు తుపానులో చిక్కుకుని మరణించాడు. గుంటూరుకు చెందిన దంపతులను రక్షించబోయి గోకుల్‌ ప్రమాదంలో చిక్కుకుని మరణించాడు. ఆ సమయంలో గోకుల్‌ భార్య శ్రీదేవి, కూతురు మహతి ఒడ్డునే ఉన్నారు. వారి కళ్లెదుటే దుర్ఘటన జరగడంతో వారు కుప్పకూలిపోయారు. గోకుల్‌ కుటుంబం గత 15 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడింది. ఈయన అమెరికాలో ఓ ప్రముఖ బీమా కంపెనీలో అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. గోకుల్‌ మరణ వార్త తెలియడంతో ఇక్కడ బాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)