సానుభూతి కోసం మోడీ అసత్యాలు !

Telugu Lo Computer
0


గుజరాత్ లోని నర్మదా జిల్లా దెదిపదలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో  కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే  ప్రసంగిస్తూ తాను అంటరాని కులానికి చెందిన వాడినని, మోడీ మాత్రం ప్రజల్లో సానుభూతి కోసం పేదవాడనని ప్రచారం చేసుకుంటారని కానీ ప్రజలు తెలివైనవారని ఎన్నిసార్లు మీరు అబద్దాలు చెబుతారని మోడీని ఖర్గే నిలదీశారు. 182 మంది సభ్యులు కలిగిన గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, డిసెంబర్ 5 తేదీల్లో పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో పాలక బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా ఎలాగైనా బీజేపీని మట్టికరిపించాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక పంజాబ్‌లో విజయంతో ఊపుమీదున్న ఆప్ గుజరాత్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)