నారింజ పండ్లను అతిగా తినకండి !

Telugu Lo Computer
0


నారింజ పండ్ల రుచి కొద్దిగా పుల్లగా, ఇంకొంచెం తీపిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఆరెంజ్‌లో తగినంత విటమిన్ సి, నీరు ఉంటుంది. చలికాలంలో దీన్ని తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆరెంజ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు వాటి వల్ల కలిగే నష్టాల గురించి వైద్యులు చెప్తున్నారు.  నారింజను ఎక్కువగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయట. ఒక రోజులో 4, 5 నారింజలను తీసుకుంటే అది శరీరంలో ఫైబర్ కంటెంట్‌ని పెంచుతుంది. శరీరంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటే ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతాయి. దీనివల్ల పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు వస్తాయి. అవసరమైన దానికంటే ఎక్కువ విటమిన్ సిని ఎప్పుడూ తినకూడదు. ఇది గుండెల్లో మంట, వాంతులు, నిద్రలేమి, గుండెపోటు వంటి సమస్యలను కలిగిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు, శరీరం సహకరించనప్పుడు కాస్త బలం కోసం నారింజ తినమని సిఫారసు చేస్తారు వైద్యులు. అయితే, కొందరు అవసరమైన దానికంటే ఎక్కువగా తింటుంటారు. అధిక పొటాషియం స్థాయిలు ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో ఇప్పటికే తగినంత పొటాషియం ఉంటే.. అది హైపర్‌కలేమియా అనే తీవ్రమైన పరిస్థితికి దారి తీస్తుంది. వాస్తవానికి, నారింజలో ఆమ్లత్వంగా అధికంగా ఉంటుంది. దీని కారణంగా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు మరింత ఇబ్బంది పడతారు.  ఒక రోజులో 1 లేదా 2 నారింజలను మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)