అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు

Telugu Lo Computer
0


జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లాలో ఈరోజు ఉదయం ఓ ప్రైవేటు ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రైవేటు ప్యాసింజర్ బస్సు మౌంగ్రీ ఖోర్ గలీ నుంచి ఉధంపూర్ పట్టణానికి వెళ్తుండగా క్రిమాచి-మాన్సర్ ఏరియాలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో ఎక్కువగా స్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్తున్న ఉద్యోగులు ఉన్నారు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఓ మూల మలుపువద్ద డ్రైవర్ బస్సుపై కంట్రోల్ కోల్పోవడంతో.. బస్సు మలుపు తిరగకుండా ఎదురుగా ఉన్న లోయలోపడింది. నలభై అడుగుల లోతున్న లోయలోకి ఫల్టీలు కొడుతూ వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు సహా మొత్తం 64 మందికి గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. డ్రైవర్ మితిమీరిన వేగంతో బస్సు నడపడంవల్లే ప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)