హీలియం ట్యాంక్ పేలి ఒకరు మృతి

Telugu Lo Computer
0


తమిళనాడులోని తిరుచ్చిలో ఆదివారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. కొటై వసల్ ప్రాంతంలోని రద్దీ మార్కెట్‌లో హీలియం ట్యాంక్ పేలిపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దుకాణాల అద్దాలు పగలిపోయాయి. జనం భయంతో పరుగులు తీయగా, దుకాణాల్లోని జనం కూడా బెంబేలెత్తారు. మంటలతో పాటు పొగలు చుట్టుపక్కల కమ్ముకున్నాయి. ఈ ఘటన మొత్తం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయింది.. హీలియం ట్యాంక్ పేలుడులో మృతిచెందిన వ్యక్తిని మాట్టు రవిగా గుర్తించారు. సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా ఘటన ఎలా జరిగిందనేది పోలీసులు విశ్లేషిస్తున్నారు. బెలూన్ అమ్మకాలు జరుపుతున్న వ్యక్తి వద్దనున్న హీలియం ట్యాంక్ పేలి ఈ ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు. బెలూన్ అమ్మకందారు కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు తిరుచ్చి పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)