జాతీయ క్రీడల్లో తెలంగాణకు మూడు పతకాలు

Telugu Lo Computer
0


జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి మరో స్వర్ణం సహా మూడు పతకాలు లభించాయి. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య - మహేశ్ జోడీ స్వర్ణం కైవసం చేసుకుంది… కనోయింగ్‌లో అమిత్‌ కుమార్‌ సింగ్‌, అభయ్‌- ప్రదీప్‌ కుమార్‌ కాంస్య పతకాలు నెగ్గారు. బీచ్‌ వాలీబాల్‌లో కృష్ణ చైతన్య, మహేశ్‌ టీమ్‌ హోరాహోరీగా సాగిన ఫైనల్లో 2-1 (22-24, 23-21, 15-11)తో ఆంధ్రప్రదేశ్‌ (నరేశ్‌-కృష్ణంరాజు) పై ఉత్కంఠ విజయం సాధించింది. 2015 కేరళ జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్ ఫైనల్లో కృష్ణంరాజు - నరేశ్ జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం నెగ్గిన ఏడేళ్ల తర్వాత అదే జంట ఈ సారి స్వర్ణ పతకం సాధించింది. 2015లో రవీందర్ రెడ్డితో కలిసి కృష్ణ చైతన్య బరిలోకి దిగాడు. ఈ సారి మహేశ్ తో జతకట్టిన కృష్ణ చైతన్య పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ఉమెన్స్‌ కేటగిరీ బ్రాంజ్​ మెడల్​ ప్లే ఆఫ్​ మ్యాచ్​లో తెలంగాణ (శ్రీకృతి-ఐశ్వర్య) 0-2తో ఒడిశా చేతిలో ఓడిపోయింది. కనోయింగ్‌ సీ1 మెన్స్‌ 1000 మీటర్ల స్ప్రింట్‌లో అమిత్‌ కుమార్ 4 నిమిషాల 31. 53 సెకండ్ల టైమింగ్‌తో మూడో స్థానంతో బ్రాంజ్‌ నెగ్గాడు. 1000 మీటర్ల సీ2 స్ప్రింట్‌లో అభయ్‌-ప్రదీప్ కుమార్ జోడీ 4 నిమిషాల 11.55 సెకండ్లతో రాష్ట్రానికి మరో కాంస్యం అందించారు. నిజామాబాద్‌ బాక్సర్‌ హుస్సాముద్దీన్‌ పురుషుల బాక్సింగ్‌ 57 కిలోల కేటగిరీలో సెమీస్ లోకి ప్రవేశించి పతకం ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5-0తో రోహిత్ మోర్(ఢిల్లీ)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో హుస్సామ్‌ 5-0తో రోహిత్‌ మూర్‌ (న్యూఢిల్లీ)పై విజయం సాధించాడు. పతకాల పట్టికలో తెలంగాణ 8 గోల్డ్‌ , 7 సిల్వర్‌, 7 బ్రాంజ్‌ సహా 22 మెడల్స్‌తో 14వ స్థానంలో నిలిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)