భర్తను గొడ్డలితో నరికిన భార్య

Telugu Lo Computer
0


రోజూ మద్యం తాగి వచ్చి చిత్రహింసలు పెడుతుండటంతో భరించలేకపోయిన భార్య అతన్ని గొడ్డలితో నరికి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని చెట్లతాండ్రలో శుక్రవారం రాత్రి జరిగింది. భర్త ఆగడాలు తట్టుకోలేక సహనం కోల్పోయి క్షణికావేశంలో హంతకురాలిగా మారింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చెట్లతాండ్ర గ్రామానికి చెందిన పొన్నాడ రాంబాబు, నరసమ్మకు 22 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన రాంబాబు నిత్యం భార్యను వేధించేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం మద్యం తాగి ఇంటికొచ్చాడు. మద్యం మత్తులో ఉన్న రాంబాబు ఇంట్లో ఉన్న కుమార్తెలతోను అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని చూసిన నరసమ్మ భర్తను నెట్టేసింది. ఈ క్రమంలో రాంబాబు కిందపడిపోయాడు. కోపంతో మీదకు రావడంతో ఇద్దరి మధ్య జరిగిన తీవ్ర పెనుగులాటలో రాంబాబు మెడపై గొడ్డలితో కొట్టింది. తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడికే భర్త రాంబాబు మృతిచెందారు. విషయం తెలుసుకున్న టెక్కలి సీఐ చంద్రమౌళి, సంతబొమ్మాళి ఎస్‌.ఐ మధుసూదనరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)