క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని తాజా నివేదిక వెల్లడించింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విజిలెన్స్ విభాగం దానిని రూపొందించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేసింది. విచారణలో భాగంగా పలు లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. 'ఈ డ్రగ్స్ కేసు విచారణలో ఏడెనిమిది మంది అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని దర్యాప్తు బృందం గుర్తించింది. ఆర్యన్ ఖాన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించినందున.. ఆ కేసును సరైన రీతిలో దర్యాప్తు చేయలేదు. అయితే ఇదంతా ఎందుకు చేశారో తెలియాల్సి ఉంది' అని ఆ నివేదిక వెల్లడించింది. అలాగే ఎన్సీబీ ముంబయి యూనిట్లో విధులు నిర్వహించిన అప్పటి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే సహా ఇతర అధికారులపై చర్యలకు సిఫారసు చేసింది. ఈ నివేదికను దిల్లీలోని కేంద్ర కార్యాలయంలో సమర్పించింది.
ఆర్యన్ ఖాన్ను కావాలనే ఇరికించారు !
October 19, 2022
0
Tags