తిరుమల తిరుపతిలోని శ్రీవారి దర్శనానికి హీరోయిన్ నందిని రాయ్ ఏకంగా మోకాళ్లపై వెళ్లి శ్రీవారి కొండ ఎక్కి మొక్కులు చెల్లించింది. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కష్టపడి మెట్లు ఎక్కినప్పటికీ చాలా అద్భుతమైన అనుభూతి పొందానని రాసుకొచ్చింది. నాని హోస్ట్గా వ్యవహరించిన బిగ్బాస్-2 ద్వారా నందినికి గుర్తింపు వచ్చింది. 'సిల్లీ ఫెలోస్', మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత శివరంజని, పంచతంత్ర కథలు లాంటి చిన్న సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు.
మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కిన నందిని రాయ్
October 19, 2022
0