ఇన్స్టాగ్రామ్లో లైక్లు మరియు వ్యాఖ్యలపై జరిగిన వాదన బుధవారం ఢిల్లీలో జంట హత్యకు దారితీసింది. సోషల్ మీడియాలో మహిళలో వివాదం కారణంగా ఢిల్లీలోని భల్స్వా డెయిరీలో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలోని ముకుంద్ పూర్ పార్ట్ 2లో తనను కలవాలని ఇద్దరు యువకులను మహిళ కోరింది. అయితే వారు అక్కడికి చేరుకోగానే దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. పలుమార్లు కత్తిపోట్లకు గురైన ఇద్దరు బాధితులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. బాధితులను ఆస్పత్రికి తీసుకొని వెళ్లి చికిత్స అందిస్తున్న సమయంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఇన్స్టాగ్రామ్ గొడవకు ఇద్దరు బలి
October 07, 2022
0