పెళ్లికి అడ్డంకులు సృష్టిస్తుందని మహిళపై దాడి !

Telugu Lo Computer
0


కేరళలోని వాకాతనానికి చెందిన శ్యామ్‌ పి శశిధరణ్‌కు కొన్ని నెలల క్రితం పెళ్లి కుదిరింది. అయితే, తన పొరిగింటిలో ఉండే ఓ మహిళ తన పెళ్లికి అడ్డంకులు కల్పిస్తోందని అతడు భావించాడు. ఆమె కారణంగా తన పెళ్లి ఆగిపోతుందని పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమె తన పెళ్లికి అడ్డుపడకుండా చూడాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం ఆమెను ఇంటి నుంచి బయటకు లాక్కువచ్చాడు. కర్రతో ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేయటం మొదలుపెట్టాడు. ఆమె అరుస్తున్నా వదిలిపెట్టలేదు. సదరు మహిళను కాపాడటానికి వచ్చిన ఆమె తండ్రిపై కూడా కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరి అరుపులు విన్న జనం అక్కడికి వచ్చారు. శ్యామ్‌ను అక్కడినుంచి పంపేశారు. గాయపడ్డ ఇద్దర్నీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం వెళ్లింది. దీంతో వారు ఆసుపత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడ్డ శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)