కర్ణాటకలోని బెళెగావి జిల్లా, హత్తరగి గ్రామానికి చెందిన వర్ధన్ ఈరణ్ణ బ్యాళి అనే ఆరేళ్ల పిల్లాడు పండగకు కొత్త బట్టలు కొనడానికి తండ్రీకొడుకులు కలిసి బైకుపై బట్టల షాపునకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో బైకు గాంధీ నగర బ్రిడ్జి మీదకు వచ్చింది. బైకు వేగంగా బ్రిడ్జి మీద వెళుతుండగా హఠాత్తుగా మాంజా తాడు బాలుడి గొంతును తాకింది. బలంగా అతడి గొంతును కోసింది. దీంతో పెద్ద గాయమై తీవ్ర రక్తస్రావం అవ్వసాగింది. కిందపడిపోయిన కుమారుడ్ని తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రి వైద్యులు అతడికి అత్యవసర చికిత్స అందించారు. అయినప్పటికి అతడు బతకలేదు. చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. బాలుడి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చైనా మాంజా తమ కుమారుడి ప్రాణాలు బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాలిపటం మాంజాకు బాలుడి బలి !
October 24, 2022
0