కర్ణాటకలో విజయదశమి సందర్భంగా బుధవారం మద్యం విక్రయాలను ప్రభుత్వం నిషేధించింది. బెంగళూరు నగరంలో దసరా ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న ఊరేగింపులకు అవాంతరం ఏర్పడకుండా ఉండేందుకు వీలుగా బుధవారం మద్యం విక్రయాలపై నిషేధం విధించామని బెంగళూరు పోలీసు కమిషనర్ ప్రతాపరెడ్డి చెప్పారు. బెంగళూరు నగరంలోని మద్యం దుకాణాలు, బార్ లలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు చెప్పారు. స్టార్ హోటళ్లు, క్లబ్ లలో మాత్రం మద్యం విక్రయాలపై నిషేధం లేదని పోలీసులు వివరించారు. నగరంలో బుధవారం జరిగిన పలు దసరా ఊరేగింపుల్లో 60వేలమంది ప్రజలు పాల్గొన్నారు.
మద్యం విక్రయాలపై నిషేధం !
October 05, 2022
0
కర్ణాటకలో విజయదశమి సందర్భంగా బుధవారం మద్యం విక్రయాలను ప్రభుత్వం నిషేధించింది. బెంగళూరు నగరంలో దసరా ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న ఊరేగింపులకు అవాంతరం ఏర్పడకుండా ఉండేందుకు వీలుగా బుధవారం మద్యం విక్రయాలపై నిషేధం విధించామని బెంగళూరు పోలీసు కమిషనర్ ప్రతాపరెడ్డి చెప్పారు. బెంగళూరు నగరంలోని మద్యం దుకాణాలు, బార్ లలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు చెప్పారు. స్టార్ హోటళ్లు, క్లబ్ లలో మాత్రం మద్యం విక్రయాలపై నిషేధం లేదని పోలీసులు వివరించారు. నగరంలో బుధవారం జరిగిన పలు దసరా ఊరేగింపుల్లో 60వేలమంది ప్రజలు పాల్గొన్నారు.