జీఎస్ఎల్వీ-3 ప్రయోగానికి సర్వం సిద్ధం !

Telugu Lo Computer
0


ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జీఎస్ఎల్వీ మార్క్-3ను నింగిలోకి పంపించేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ నెల 23న ఎల్‌వీ-ఎం 3 రాకెట్‌ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇవాళ్టి అర్ధరాత్రి నుంచి కౌంట్ డౌన్ మొదలు కానుంది. 5 వేల 200 కిలోల బరువు కలిగిన యూకేకు చెందిన 36 కమర్షియల్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపించనున్నారు. ఎన్ ఎస్ ఐఎల్ తో ఒప్పందం తరువాత నిర్మాణం అయిన తొలి బరువైన రాకెట్ ఇదే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. పూర్తి వాణిజ్య అవసరాల కోసం ఈ రాకెట్ ను రూపొందించారు. ఒకేసారి 36 విదేశీ ఉప ప్రగహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి వ్యాపార పరమైన ఎన్నో లాభాలు కలిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 36 ఉపగ్రహాల ప్రయోగానికి వన్ బెబ్, ఎన్ఎస్ఐఎల్ మధ్య ఇటీవల ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు టన్నుల ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ కి పంపగలదు. భారతదేశం నుండి నింగిలోకి పంపించే జీఎస్ఎల్వీ మార్క్-3లో ఉపగ్రహాల ప్రయోగాన్ని చేపట్టడం ఎన్ఎస్ఐఎల్, ఇస్రోలకు ఒక చారిత్రాత్మక క్షణం అని ఎన్ఎస్ఐఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)