సోనియా, రాహుల్ జైలుకెళ్లడం ఖాయం !

Telugu Lo Computer
0


నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ తదితరులకు జైలు శిక్ష ఖాయమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. బీజేపీ అధికారంలో కొనసాగితే మాత్రం వారు జైలుకు వెళ్లడం తప్పదన్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం చెప్పలేమన్నారు. అలాగే ఆయన దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా నేషనల్ హెరాల్డ్‌కు సంబధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)