ఆప్ మునిసిపల్ కౌన్సిలర్ కాల్చివేత

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని మలేర్ కోట్లా జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ మునిసిపల్ కౌన్సిలర్ దారుణ హత్యకు గురైయ్యారు. మొహమ్మద్ అక్బర్ అనే వ్యక్తిని చాలా దగ్గరిగా వచ్చి షూట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ” జిమ్ లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడు బాగా దగ్గరిగా వచ్చి అక్బర్ ను షూట్ చేశాడు. దాంతో అతను స్పాట్ లోనే మృతి చెందాడు” అని మలేర్ కోట్లా సీనియర్ ఎస్పీ అవనీత్ కౌర్ సిద్ధూ తెలిపారు. ప్రాథమిక ఎంక్వైరీలో ఒక బుల్లెట్ గాయంతో మృతి చెందినట్లు తెలుస్తుంది. వ్యక్తిగత ద్వేషంతో హత్య జరిగిందా మరైదేనా కారణమా తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియోలో అక్బర్ గుర్తు తెలియని వ్యక్తి వైపుగా వెళ్తున్నాడు. అక్బర్ సమీపిస్తుండగా ఆ వ్యక్తి ఆయుధమైన తుపాకీని తీసి కాల్చాడు. ఇందులో ఇద్దరు వ్యక్తులు భాగంగా ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అధికార పార్టీ కౌన్సిలర్ హత్య జరగడంతో ఆ ప్రాంతమంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)