ఫైనల్‌కు చేరిన పీవీ సింధు

Telugu Lo Computer
0


కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో బ్యాడ్మింటన్‌ స్టార్‌, తెలుగు తేజం పీవీ సింధు సెమీస్‌లో సింగపూర్‌ షట్లర్‌ ఇయో జియా మిన్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది. క్వార్టర్‌ ఫైనల్లో సింధు మలేషియా షట్లర్‌ గో వె జిన్‌ను 19-21, 21-14, 21-18తో ఓడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్‌ వేదికగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు జియాతో సెమీస్‌లో పోటీపడింది. హోరాహోరీగా సాగిన పోరులో సింధు పైచేయి సాధించింది. ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా తన అనుభవంతో ఒత్తిడిని జయించి పీవీ సింధు 21-19, 21-17తో గెలుపు నమోదు చేసింది. తద్వారా ఈ భారత షట్లర్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 ఫైనల్లో ప్రవేశించింది. కాగా సింధు ఈ ఫీట్‌ నమోదు చేయడం వరుసగా ఇది రెండోసారి. తాజా ప్రదర్శనతో ఆమె ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో వరుసగా మూడో పతకాన్ని ఖాయం చేసుకుంది. కాగా 2018 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సింధు రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా 2014లో కాంస్య పతకం అందుకుంది. ఇక ఇప్పుడు స్వర్ణ పతకానికి పూసర్ల వెంకట సింధు  గురిపెట్టింది.


Post a Comment

0Comments

Post a Comment (0)