రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లామంగళియావాస్ పోలీసు స్టేషన్ పరిధిలో నలుగురు పిల్లలను బావిలో పడేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలిపారు. కుటుంబ కలహాల వల్ల మతియా (32) అనే మహిళ మనస్తాపం చెందింది. గత రాత్రి తన పిల్లలు కోమల్ (4), రింకు (3), రాజ్ వీర్ (22 నెలలు), దేవ రాజ్ (నెల వయసు)ను వెంట తీసుకుని ఆ బావి వద్దకు వెళ్ళింది. నలుగురు పిల్లలను బావిలోకి తోసేసి, అనంతరం ఆమె కూడా దూకింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించి, బావిలో ఉన్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. మతియాను ప్రాణాలతో బయటకు తీశారు. ఆమె నలుగురు పిల్లలు మాత్రం మృతి చెందారు. వారిలో ముగ్గురు మృతదేహాలను నిన్న సాయంత్రం తీశామని, నెల వయసున్న దేవ రాజ్ మృతదేహాన్ని ఇవాళ ఉదయం బయటకు తీశామని పోలీసులు తెలిపారు. మతియా భర్త బోదురాజ్ గుర్జార్ ఓ రైతు అని వివరించారు. కుటుంబ కలహాలతో విసిగిపోయిన మతియా పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందని చెప్పారు.
పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
August 06, 2022
0
Tags