ప్రాణం తీసిన చికెన్ పకోడీ !

Telugu Lo Computer
0


బెంగుళూరులోని బన్నేరుఘట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అరెకెరె లే ఔట్ లో సురేష్ (48) అనే వ్యక్తి బొమ్మన హళ్లిలోని గార్మెంట్స్ కర్మాగారంలో పని చేస్తుంటాడు. గత గురువారం భార్య షాలిని (42)ని చికెన్ పకోడి చేయమని కోరాడు. సాయంత్రం అతను ఇంటికి వచ్చే సరికి భార్య చికెన్ పకోడి చేసి రెడీగా ఉంచింది. ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వచ్చిన భర్తకు చికెన్ పకోడీ ప్లేట్ లో పెట్టి ఇచ్చింది. అది అతనికి నచ్చలేదు. పకోడీ రుచిగా చేయలేదనే కారణంతో భార్య షాలినీని చావబాదాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న కత్తితో ఆమె తల, చేతులపై గాయాలు చేసి పరారయ్యాడు. షాలిని కేకలు విన్న చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. సమచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వచ్చి షాలిని వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. భర్త సురేష్ పై కేసు నమోదు చేశారు. కాగా పరారీలో ఉన్న సురేష్ ఇంటికి సమీపంలో ఉన్నఖాళీ ప్రదేశంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)