బురదలో ఇరుక్కున్న ఇండిగో విమానం

Telugu Lo Computer
0


ఇండిగోకు చెందిన ఓ విమానం టేకాఫ్ అవుతుండగా బురదలో ఇరుక్కుంది. ప్రమాదవశాత్తూ రన్‌వే నుంచి జారి పక్కనే ఉన్న బురదలో రెండు టైర్లు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని ఆపేశారు. అనంతరం ప్రయాణీకులను క్షేమంగా దింపి, వారిని మరో విమానంలో పంపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అస్సాంలోని జోర్హత్ విమానాశ్రయంలో కోల్‌కతా వెళ్లేందుకు బయల్దేరిన ఇండిగో విమానం టేకాఫ్ అవుతుండగా, రన్‌వే నుంచి జారి బురదలోకి వెళ్లిపోయింది. దీంతో 98 మంది ప్రయాణీకులు ఆందోళనకు లోనయ్యారు. ప్రయాణీకులను క్షేమంగా దింపి వారిని వేరే విమానంలో కోల్‌కతాకు పంపించే ఏర్పాట్లు చేశారు. అనంతరం విమానం సాంకేతిక కారణంతో రద్దైందని ప్రకటించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)