నాణ్యతకు సాక్ష్యం ఈ భారీ గొయ్యి !

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని వస్త్రాల్ ప్రాంతంలోని సురభి పార్క్ సమీపంలో కొత్తగా నిర్మించిన రహదారి ఆదివారం ప్రాంతంలో కొన్ని గంటల వర్షం తర్వాత కుంగిపోయింది. రోడ్డు కూలిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మెట్రో రైలు మార్గంలోని పిల్లర్ నంబర్ 123 సమీపంలో రోడ్డు మధ్యలో పెద్ద గుంత పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రహదారిని నెల రోజుల క్రితం నిర్మించినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో అటువైపు వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)