జై భీమ్‌ వివాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ చెన్నై కోర్టు ఆదేశాలు

Telugu Lo Computer
0


హిందూ వన్నియార్ల సామాజిక వర్గం తమ మనోభావాలు దెబ్బతినే విధంగా జై భీమ్‌ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హీరో సూర్య, నిర్మాత జ్యోతిక, డైరెక్టర్ జ్ఙానవేల్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, హీరో సూర్యతో పాటు ఇతరులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వెలచ్ఛేరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పిటిషన్‌ రద్దు చేయాలని కోరుతూ జైభీమ్‌ చిత్ర యూనిట్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే సోమవారం విచారించిన న్యాయమూర్తి సతీష్‌ కుమార్‌ విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ కేసు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)