ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో మరోసారి భూప్రకంపనలతో జనం భయాందోళనలకు గురయ్యారు. బుధవారం ఉదయం నాలుగు మండలాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాలతోపాటు మర్రిపాడు మండలంలో భూ ప్రకంపనలు సంభవించాయి. పలు గ్రామాల్లో మూడు సెకన్ల నుంచి ఐదు సెకన్లపాటు స్వల్పంగా భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూ ప్రకంపనలతో ఇళ్లల్లోని వస్తువులు కదలడంతో భయంతో జనం బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత కాసేపటి తర్వాత మళ్లీ ఇళ్లకు చేరుకున్నారు. స్వల్పంగానే భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఒకేసారి నాలుగు మండలాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలుమార్లు నెల్లూరు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
Post Top Ad
adg
Wednesday, 13 July 2022
Home
Andhra Pradesh
దుత్తలూరు
నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు
మర్రిపాడు మండలం
మూడు సెకన్ల నుంచి ఐదు సెకన్లపాటు
వరికుంటపాడు
వింజమూరు
నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు
నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు
Tags
# Andhra Pradesh
# దుత్తలూరు
# నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు
# మర్రిపాడు మండలం
# మూడు సెకన్ల నుంచి ఐదు సెకన్లపాటు
# వరికుంటపాడు
# వింజమూరు
About Telugu Post
వింజమూరు
Tags
Andhra Pradesh,
దుత్తలూరు,
నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు,
మర్రిపాడు మండలం,
మూడు సెకన్ల నుంచి ఐదు సెకన్లపాటు,
వరికుంటపాడు,
వింజమూరు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment