మధ్యప్రదేశ్లోని కాన్పూర్లో నివసిస్తున్న భర్త, అతని తల్లిదండ్రులపై ఇండోర్ మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల క్రితం వివాహానంతరం హనీమూన్కు కాన్పూర్లోని హోటల్కు తీసుకెళ్లిన భర్త అసహజ శృంగారం చేయమని బలవంతం చేశాడని చెప్పింది. బాత్రూమ్లో కెమెరా పెట్టి తన న్యూడ్ వీడియోలు తీశాడని, రూ. కోటి తీసుకురాకపోతే వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడని చెప్పింది. భర్త చేష్టలను మామగారికి చెప్పడంతో.. అతను కూడా తనపై వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. అంతా తెలిసినా అత్తగారు తనను మౌనంగా ఉండమని బెదిరిస్తోందని చెప్పింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ మహిళ ఇండోర్లోని తన పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులకు తన బాధను వివరించింది. అనంతరం తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ చెప్పింది విన్న పోలీసులు మొత్తం ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. త్వరలోనే నిందితులను విచారిస్తామన్నారు.
భార్యపై భర్త శాడిజం !
July 03, 2022
0
Tags