బీహార్ లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎనిమిది జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి 48 గంటల్లో పిడుగుపాటుకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రగాఢ సంతాపం తెలిపారు. పిడుగుపాటు వల్ల కైమూర్ జిల్లాలో ఏడుగురు, పాట్నా, భోజ్పూర్ జిల్లాల్లో నలుగురు చొప్పున, జహానాబాద్, ఆర్వాల్, రోహ్తాస్, ఔరంగాబాద్, సివన్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు సీఎం నితీశ్ కుమార్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరారు. పాట్నాలోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జూలై 30 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ వారంలో రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి కామిని కుమారి చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురవడంతోపాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందన్నారు.
Post Top Ad
adg
Wednesday 27 July 2022
Home
48 గంటల్లో
weather
నితీశ్ కుమార్ ప్రగాఢ సంతాపం
బీహార్ లో పిడుగులు పడి 20 మంది మృతి
భారీ వర్షాలు
బీహార్ లో పిడుగులు పడి 20 మంది మృతి
బీహార్ లో పిడుగులు పడి 20 మంది మృతి
Tags
# 48 గంటల్లో
# weather
# నితీశ్ కుమార్ ప్రగాఢ సంతాపం
# బీహార్ లో పిడుగులు పడి 20 మంది మృతి
# భారీ వర్షాలు
About Telugu Lo Computer
భారీ వర్షాలు
Tags
48 గంటల్లో,
weather,
నితీశ్ కుమార్ ప్రగాఢ సంతాపం,
బీహార్ లో పిడుగులు పడి 20 మంది మృతి,
భారీ వర్షాలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment