దేశంలో కొత్తగా 20,408 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 20,408 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 20,958 మంది మహమ్మారి నుంచి కోలుగకోగా.. 54 మంది కరోనా బారిన పడి మరణించినట్లు  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,43,384కు చేరింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేట్‌ 5.05 శాతంగా నమోదు అయింది. తాజాగా గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 203.94 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అందించారు. శుక్రవారం ఒక్క రోజే దేశంలో 33,87,173 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)