ఉత్తరప్రదేశ్కు రుతుపవనాలు చేరుకున్నాయి. దీంతో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలీఘర్ వద్ద భారీ వర్షం కురవడంతో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. ఇదే సమయంలో స్కూటర్ పై ఓ జంట వెళ్తుంది. వరద నీటిలో నుంచి బైక్ ను వేగంగా నడిపే ప్రయత్నం చేయడంతో అక్కడే మ్యాన్ హోల్ లో ఇద్దరు పడిపోయారు. వెంటనే తేరుకొని మ్యాన్ హోల్ నుంచి బయటకు లేచారు. స్థానికులు గమనించి వారిని మ్యాన్ హోల్ నుంచి బయటకు లాగారు. అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి గాయాలు కాకుండానే ప్రాణాలతో బయటపడ్డారు. బైక్ మాత్రం మ్యాన్ హోల్ లోనే ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడది వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినవారంతా అయ్య బాబోయ్.. బతికిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వర్షాకాలంలో వాహనాలపై జాగ్రత్తగా ప్రయాణించాలంటూ సూచనలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే స్కూటర్లో ప్రయాణించేది ఉత్తరప్రదేశ్ కు చెందిన పోలీసు అధికారి, అతని భార్య అని స్థానికులు తెలిపారు. వారు వైద్యుల వద్దకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
మ్యాన్హోల్లో పడిన జంట !
June 19, 2022
0
Tags