ఒడిశా లోని జగత్సింగ్పూర్ జిల్లా తిర్తోల్ నియోజకవర్గ బిజు జనతాదళ్ ఎమ్మెల్యే బిజయ్ శంకర్ దాస్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆ తర్వాత మోసం చేశారంటూ సోమాలిక దాస్ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ వివాహానికి ఇరు కుటుంబాల వారు అంగీకరించారని, పెళ్లి కోసం జగత్సింగ్ పూర్లోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో మే 17న దరఖాస్తు కూడా చేసుకున్నామన్నారు. శుక్రవారం స్లాట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే రాలేదని, చాలాసేపు ఆయన కోసం చూసి వెళ్లిపోయినట్టు చెప్పారు. ఫోన్ చేసినా స్పందించలేదని, దీంతో తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సోనాలిక తెలిపారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎమ్మెల్యే మోసం చేశాడు !
June 19, 2022
0
Tags