ఈడీ ముందు మరోసారి హాజరైన రాహుల్ గాంధీ

Telugu Lo Computer
0


నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఈడీ ఎదుట ఈరోజు విచారణకు హాజరయ్యారు.  దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ కేంద్రానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ భారీగా నిరసనలు చేపట్టింది. ఇవాళ కూడా నిరసనలను కొనసాగిస్తోంది కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఈడీ విచారణ పేరుతో రాహుల్ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా. చైనా ఆక్రమణలు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపు, నిరుద్యోగం, మత విద్వేషాలపై రాహుల్ ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉండేవారన్నారు. మేం గాంధీ వారసులం.. మరోసారి సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధం.. సత్యాగ్రహం ఆగదు అని సూర్జేవాలా అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)