ఢిల్లీలో తీవ్రమైన వడగాడ్పు

Telugu Lo Computer
0


గత రెండు రోజులుగా ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో సహా పొరుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలుల కారణంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. జూన్ 10 తర్వాత వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.ఢిల్లీలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ మార్కు కంటే ఎక్కువగా ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఢిల్లీతోపాటు హర్యానా, యూపీ, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మరో నాలుగురోజుల పాటు వేడిగాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. ఎండలు మండుతున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్ కె జెనామణి చెప్పారు.దేశంలోని ఉత్తర ప్రాంతంలోకి రుతుపవనాలు ఇంకా ప్రవేశించలేదని ఐఎండీ శాస్త్రవేత్త తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)