కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ సొంత ఎమ్మెల్యేలకే ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు చొప్పున ఇచ్చి కొనుగోలు చేసిందని కోలారు ఎమ్మెల్యే కె శ్రీనివాస గౌడ ఆరోపించారు. శనివారం నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు కూడా రూ. 50 లక్షలు ఇవ్వజూపారని, అయితే తాను తీసుకోలేదని అన్నారు. ఎమ్మెల్యేలను లంచం ఇచ్చి కొనుగోలు చేసిన పార్టీ నాయకులు తన గురించి ఆరోపణలు చేయడంలో అర్థం లేదని అన్నారు. జేడీఎస్కి ఎప్పటి నుంచో దూరంగా ఉన్నానని, అందుకే రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓటేశానని బహిరంగంగానే చెప్పానని అన్నారు. స్థానిక జేడీఎస్ నాయకులు తన ఇంటి ముందు ఆందోళన చేస్తే తాను భయపడేది లేదని అన్నారు.
సొంత ఎమ్మెల్యేలకే రూ. 50 లక్షలు ఇచ్చారు
June 12, 2022
0
Tags