ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ముంబై-అహ్మాదాబాద్‌ జాతీయ రహదారిపై పాల్ఘర్‌ జిల్లాలోని తవా గ్రామ సమీపంలో 12 వేల లీటర్ల ఆయిల్‌ ను తరలిస్తున్న ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. గుజరాత్​లోని సూరత్​ నుంచి ముంబైకి నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ట్యాంకర్​ నుంచి లీకైన నూనె కోసం ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో వంట నూనెను నింపుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసుల అధికారులు మూడు  గంటలపాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు.

Post a Comment

0Comments

Post a Comment (0)