భార్యను రెండోసారి పెళ్లాడిన భర్త

Telugu Lo Computer
0


కర్ణాటక లోని బొరిగుమ్మ సమితి, బిసింగ్‌పూర్‌ పంచాయతీ పొడపొదర్‌ గ్రామానికి చెందిన ఘాస్సీ అమానత్య రెండేళ్ల కిత్రం ఉపాధి నిమిత్తం ఆంధ్రాలోని తిరుపతికి వెళ్తుండగా మార్గమధ్యంలో తప్పిపోయాడు. గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. అలా ఎనిమిది నెలలు గడిచి పోయిన తరువాత చనిపోయి ఉంటాడని భావించి, కుటుంబసభ్యులు తమ పద్ధతిలో ఘాస్సీ భార్యను వితంతువును చేశారు. మళ్లీ రెండు నెలల క్రితం ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నాడు. తప్పిపోయిన తాను ఒక చోట స్పృహ కోల్పోయానని 4 రోజుల తర్వాత ఒక అడవిలో కళ్లు తెరిచి, 7 రోజులు నడిచి బెంగళూరు చేరుకున్నట్లు చెప్పాడు. అక్కడే ఒక నర్సరీలో రెండేళ్లు పని చేసి, రూ.6 వేలు దాచుకుని తిరిగి ఇంటికి వచ్చినట్లు వెల్లడించాడు. రెండోసారి వేదమంత్రాల సాక్షిగా భార్యను పెళ్లాడాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)