హిమచల్ ప్రదేశ్ లో ఖలిస్థాన్ టెర్రరిస్టులు కలకలం రేపారు. రాష్ట్ర అసెంబ్లీ ప్రధాన గేటు, గోడలపై ఖలిస్థాన్ జెండాలను వేలడదీశారు. ఆదివారం ఉదయం గుర్తించిన పోలీసులు వాటిని తొలగించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాతగాని, ఆదివారం తెల్లవారుజామున గాని జెండాలను తగిలించి ఉంటారని కాంగ్రా ఎస్పీ ఖుషల్ శర్మ చెప్పారు. ఇది పంజాబ్ నుంచి వచ్చిన ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఐతే గత నెలలో సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థకు చెందిన నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్ను సిమ్లాలో ఖలిస్థాన్ జెండాలు ఎగురవేయాలని గత నెల పిలుపునిచ్చాడు. ఆయన పిలుపు మేరకే ఇలా కొంతమంది ఉగ్రవాదులు ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
హిమాచల్ అసెంబ్లీ ఖలిస్థాన్ జెండా
May 08, 2022
0