కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా నదికి వరద పోటెత్తింది. రాత్రి నుంచి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వద్ద పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహానికి పలు చోట్ల రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కర్ణాటకలోని కడగత్తురు నుంచి హిందూపురం వచ్చే రహదారిపై పోచనపల్లి వద్ద వంతెన పాక్షికంగా కూలిపోయింది. రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే కొట్నూరు చెరువు నిండి పేరురు డ్యామ్లోకి నీరు వెళ్లనున్నాయి. విడపనకల్లు, ఉరవకొండ మండలాల్లోని ఉండబండ, డోనేకల్లు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ రూట్లో తెల్లవారుజాము నుంచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హిందూపురం వద్ద పెన్నా నదికి వరద పోటు !
May 19, 2022
0
Tags