స్వదేశీ యాంటీ షిప్ మిసైల్‌ ప్రయోగం విజయవంతం

Telugu Lo Computer
0


ఒడిశా బాలేశ్వర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్​లో (ఐటీఆర్) నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి నౌకాదళ యాంటీ షిప్ క్షిపణిని తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు. ఈ క్షిపణి ప్రయోగం సాంకేతికతలో స్వావలంబన సాధించడానికి ఒక ముఖ్యమైన ముందడుగని నేవీ సీనియర్ అధికారులు తెలిపారు. భారత నౌకాదళం, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్​డీవో)తో కలిసి ఈ పరీక్షను నిర్వహించింది. సీకింగ్ 42బి హెలికాప్టర్ ద్వారా క్షిపణిని ప్రయోగిస్తున్న వీడియోను ట్విట్టర్‌లో భారత నావికాదళం షేర్ చేసింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. యాంటీ-షిప్ వెర్షన్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒక నెల తర్వాత కొత్త క్షిపణిని పరీక్షించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)