పాక్‌కు సౌదీ అరేబియా 8 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం

Telugu Lo Computer
0


ఆర్థిక వ్యవస్థ పతనంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా  8 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం  ప్రకటించింది. పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ దేశ పర్యటనలో ఉండగా సౌదీ ఈ మేరకు అంగీకారం తెలిపింది. ఈ ప్యాకేజీతో పాకిస్తాన్‌లో ఆయిల్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీని రెట్టింపు చేయనున్నారు. మిగతా నిధులను డిపాజిట్ల రూపంలో పాక్‌కు అందించనున్నారని ది న్యూస్ ఇంటర్నేషనల్ పేర్కొంది. అయితే ఈ ప్యాకేజీకి సంబంధించిన సాంకేతిక వివరాలు సిద్ధమవుతున్నాయి. డాక్యుమెంట్లను రూపొందించి సంతకాలు చేసేందుకు రెండు వారాల సమయం పడుతుందని సౌదీకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. వాస్తవానికి పాక్ ప్రధాని షాబాజ్, ఇతర అధికారుల సౌదీ పర్యటన ముగిసింది. వారంతా తిరిగి పాక్ చేరుకున్నారు. కానీ ఆ దేశ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మైల్ ఇంకా సౌదీలోనే ఉన్నారు. ఆర్థిక ప్యాకేజీని ఖరారు చేసుకునేందుకు ఆయన అక్కడ ఉన్నారు. అధికారులతో టెక్నికల్ స్థాయి చర్చల కోసం తాను సౌదీలోనే ఉన్నానని ఇస్మైల్ ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)