గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1829 కొత్త కేసులు, 33 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 15,647 యక్టీవ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,31,27,199 కేసులు, 5,24,293 మరణాలు నమోదు అయ్యాయి. కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 2,550 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,25,87,259 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు 84.49 కోట్లు దాటింది. గడిచిన 24 గంటల్లో 4,34,962 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84,49,26,602 కరోనా టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3372 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1433 ప్రభుత్వ లాబ్స్,1939 ప్రైవేట్ లాబ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది.
దేశంలో 1829 కరోనా కొత్త కేసులు నమోదు
May 18, 2022
0
Tags