దేశంలో 1,569 కరోనా కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 3,57,484 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 1,569 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,25,370 కి చేరింది. నిన్న కరోనా కారణంగా 19 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,260కి చేరింది. గత 24 గంటల్లో 2,467 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,84,710 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75 గా, రోజు వారి పాజిటివీ రేటు 0.44గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 10.78లక్షల మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,91,48,94,858 డోసులను పంపిణీ చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)