ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని పలాసుని ప్రాంతంలో జాతీయ రహదారి 16 వద్ద సోమవారం ఉదయం ట్రాఫిక్ సిగ్నల్ పడింది. దీంతో పలు వాహనాలు బారులు తీరాయి. ఒక లారీ వెనుక రెండు కార్లు ఆగి ఉన్నాయి. ఇంతలో లోడ్తో ఉన్న మరో లారీ వేగంగా ముందు ఆగిన కార్లపైకి దూసుకెళ్లింది. వైట్ కారు రోడ్డు డివైడర్ వైపునకు వెళ్లగా ముందున్న లారీ వెనుక ఉన్న నీలం రంగు కారు రెండు లారీల మధ్య ఇరుక్కుని నుజ్జునుజ్జైంది. అలాగే ముందున్న కారును లారీ, ముందున్న మరో లారీని ఆ కారు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో నుజ్జైన నీలం రంగు కారులోని డ్రైవర్ మరణించాడు. ఈ వరుస ప్రమాదాల్లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన లోడు లారీ డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఆ జాతీయ రహదారిపై సుమారు ఐదు గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు పారిపోయిన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అయితే అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రెండు లారీల మధ్య నుజ్జునుజ్జయిన కారు
April 04, 2022
0
Tags