ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ ప్రైవేట్ స్కూల్ లో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ రాగానే పాఠశాలను మూసేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్ లో ఇద్దరు పిల్లలకు కొవిడ్ సోకగానే... అప్రమత్తమై ఆఫ్ లైన్ క్లాసులను రద్దు చేసినట్లు స్కూలు యాజమాన్యం తెలిపింది. మూడు రోజుల పాటు ఆన్ లైన్ క్లాసులు మాత్రమే ఉంటాయని, ఆ తర్వాత కొత్త కేసులేవీ నమోదు కాకుంటే ఆఫ్ లైన్ క్లాసుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఇంటి వద్ద ఉన్న సమయంలో పిల్లల ఆరోగ్య పరిస్థితిని గమనించి, మళ్లీ స్కూల్ ఓపెన్ చేశాక క్లాసులకు పంపే విషయంలో నిర్ణయం తీసుకోవాలని పేరెంట్స్ కు సూచిస్తూ సర్క్యులర్ ఇష్యూ చేసింది. క్యాంపస్ తో పాటు స్కూల్ బస్సులను మొత్తం శానిటైజ్ చేస్తున్నామని అందులో పేర్కొంది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా మూతపడిన అన్ని క్లాసులకు ఆఫ్ లైన్ క్లాసులను నిర్వహించాలని ఫిబ్రవరి 17నే యూపీ రాష్ట్ర సర్కారు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు 12 ఏండ్లు పైబడిన పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో స్కూళ్ల నిర్వహణ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యా శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Post Top Ad
adg
Sunday, 10 April 2022
Home
corona
Kovid19
National
ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్
యూపీ స్కూల్లో ఆఫ్లైన్ క్లాసులు రద్దు
యూపీ స్కూల్లో ఆఫ్లైన్ క్లాసులు రద్దు !
యూపీ స్కూల్లో ఆఫ్లైన్ క్లాసులు రద్దు !
Tags
# corona
# Kovid19
# National
# ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్
# ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్
# యూపీ స్కూల్లో ఆఫ్లైన్ క్లాసులు రద్దు
About Telugu Post
యూపీ స్కూల్లో ఆఫ్లైన్ క్లాసులు రద్దు
Tags
corona,
Kovid19,
National,
ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్,
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్,
యూపీ స్కూల్లో ఆఫ్లైన్ క్లాసులు రద్దు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment