ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గంలోనే ఆ పార్టీకి స్వతంత్ర అభ్యర్థి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. స్థానికంగా గట్టి పట్టున్న బ్రిజేష్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ బీజేపీ అభ్యర్థి సుధామ పటేల్‌ను ఓడించారు. వారణాసి- చందౌలి, బధౌలీ ఎమ్మెల్సీ సీటు నుంచి అన్నపూర్ణ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి, విజయం సాధించింది. ఇక ప్రతాప్‌గఢ్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా బీజేపీ ఓటమి చవిచూసింది. రాజా భయ్యా సన్నిహితుడు అక్షయ్ ప్రతాప్ సింగ్ బీజేపీ అభ్యర్థి హరి ప్రతాప్ సింగ్‌ను ఓడించారు. ఇక ఆజంగఢ్‌లోనూ బీజేపీ ఓడిపోయింది. బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్సీ యశ్వంత్ తన కుమారుడు విక్రాంత్ సింగ్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి దింపారు. బీజేపీ తన అభ్యర్థిగా రకామాంత్ యాదవ్‌ను దింపింది. పార్టీపై యశ్వంత్ తిరుగుబాటు చేసినా.. తన కుమారుడు విక్రాంత్ సింగ్‌ను ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. ఇక మొత్తం 36 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా… బీజేపీ 30 స్థానాలను కైవసం చేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)