డ్రగ్స్ కేసులో నాపై బురద జల్లుతున్నారు

Telugu Lo Computer
0


హైదరాబాద్ బంజారాహిల్స్ ఫుడింగ్ పబ్ లో డ్రగ్స్ వాడకం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ డ్రగ్స్ పార్టీలో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నారు. ఈ కేసులో సినీ నటి హేమ పేరును కొన్ని వార్తా సంస్థలు ప్రసారం చేశాయి. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎటువంటి సంబంధంలేని కేసులో తన పేరు బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. బంజారాహిల్స్ పీఎస్ కు వచ్చిన హేమ తనపై వస్తున్న వార్తలపై ఫిర్యాదు చేశారు. తాను పబ్ లో లేకపోయినా ఉన్నట్లు వార్తలు వచ్చాయని ఆవేదన చెందారు. తనపై తప్పుడు వార్తలు రాసిన ఓ న్యూస్ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని హేమ ఫిర్యాదు చేశారు. "హైదరాబాద్ లో డ్రగ్స్ లేకుండా చేయాలి. సినిమా వాళ్లు ఫోకస్ అవుతారు కాబట్టే మాపై బురదజల్లుతున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలి. డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. డ్రగ్స్ వాడిన వాళ్లని చెప్పుతో కొట్టాలి. డ్రగ్స్ అంటే సినిమా వాళ్లు ఫోకస్ అవుతారు. చిన్న పిల్లలు దగ్గర నుంచి గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను." అని నటి హేమ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)