ఇల్లు కొందామని అప్పు చేస్తే....!

Telugu Lo Computer
0


నల్గొండ జిల్లా మోత్కూరులోని పద్మశాలికాలనీలోని బిల్లకంటి మహేందర్‌రెడ్డి ఇంట్లో శనివారం జరిగిన విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా వ్యవసాయ పనులకు వెళ్లారు. పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక ఎస్సై సాయిదీపక్‌ సిబ్బందితో వెంటనే వచ్చి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పటికే సామాన్లు, వస్త్రాలు తగలబడిపోగా, దుస్తుల్లో దాచిన రూ.4 లక్షల నగదు కాలిపోయింది. ఇందులో రూ.3.50 లక్షలు పూర్తిగా బూడిదవ్వగా, రూ.50 వేల నగదు కొంతమేర కాలింది. సగం కాలిన నోట్లను మార్చేందుకు స్థానిక ఎస్‌బీఐకు వెళ్లగా నంబర్లు కనపడకుండా కాలిపోవడంతో వీలుకాదని అధికారులు పేర్కొన్నట్లు బాధితుడు ఆవేదన చెందాడు. స్థానిక పోలీసులు పంచనామా నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)