ఉత్తరప్రదేశ్‌ జైళ్లలో గాయత్రీ జపం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం జైళ్లలో గాయత్రీ జపం, మహా మృత్యుంజయ మంత్రాన్ని టేప్‌ల ద్వారా విన్పిస్తుంది. జైళ్లలోని ఖైదీలలో పరివర్తన , సంస్కరణల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గాయత్రీ జపం, మృత్యుంజయ మంత్రం నిరంతరం జైళ్లలో విన్పించే నిర్ణయం గురించి రాష్ట్ర జైళ్ల మంత్రి ధరమ్‌వీర్ ప్రజాపతి జైలు అధికారులకు తమ ఆదేశాల ద్వారా తెలిపారు. ఖైదీలలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి , వారు తిరిగి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా తెలిపారు

Post a Comment

0Comments

Post a Comment (0)