హిందీ అంటే ఇష్టపడనివారు భారతీయులు కాదని, హిందీ మాట్లాడనివారు దేశం విడిచి వెళ్లిపోవాలని ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీని ప్రేమించని వారు విదేశీయులుగా లేదా విదేశీ శక్తులతో సంబంధాలు ఏన్నవారిగా పరిగణించబడుతారంటూ వ్యాఖ్యానించారు. బాలివుడ్ నటుడు అజయ్ దేవగన్-కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ మధ్య ట్విట్టర్ లో జరిగిన భాష గురించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మరోసారి ప్రాముఖ్యత సంతరించుకున్న భాషా చర్చపై ప్రస్తుతం దేశంలో భాష అంశంపై జరుగుతున్న చర్చకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సంజయ్ నిషాద్ స్పందిస్తూ భారత్లో నివసించాలనుకునే వారు తప్పనిసరిగా హిందీని ప్రేమించాల్సిందేనని అన్నారు. ఇండియా అంటే హిందుస్థాన్ అని రాజ్యాంగం చెబుతోందని, అంటే హిందీ మాట్లాడేవారి ప్రాంతమని అర్థం అంటూ మంత్రి విచిత్రమైన అర్థం చెప్పుకొచ్చాడు.
హిందీ మాట్లాడని వారు దేశం వదిలి వెళ్లిపోవాలి
April 30, 2022
0
Tags