రిమ్స్ నుంచి ఎయిమ్స్ కి లాలూ ప్రసాద్ తరలింపు !

Telugu Lo Computer
0


ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో రాంచీ రిమ్స్ లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ ను..వైద్యులు మంగళవారం ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించనున్నట్లు రిమ్స్ అధికారులు వెల్లడించారు. “లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, ఆయనకు అత్యవసరంగా డయాలిసిస్ చేయాల్సిన అవసరం ఉండడంతో ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించాలని సూచించామని” రాంచీ రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర ప్రసాద్ తెలిపారు. జైలు అధికారుల నుంచి అనుమతి వచ్చిన అనంతరం లాలూను ఢిల్లీకి తరలించనున్నట్లు కామేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ గత కొన్ని రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, జైలు అధికారుల పర్యవేక్షణలో రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో లాలూ చికిత్స పొందుతున్నారు. లాలూ చికిత్స తీసుకుంటున్న సమయంలోనే దొరండా ట్రెజరీ నుంచి అక్రమంగా విత్‌డ్రా చేసిన కేసులో లాలూకు మరో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది సీబీఐ కోర్టు. దీంతోపాటు రూ.60 లక్షల జరిమానా చెల్లించాలని ఫిబ్రవరి 21న సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)